జమాతె ఆస్తులు సీల్‌

18 Dec, 2022 06:41 IST|Sakshi

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని నిషేధిత జమాతె ఇస్లామీ(జేఈఐ) సంస్థకు చెందిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను శనివారం రాష్ట్ర దర్యాప్తు సంస్థ (ఎస్‌ఐఏ) సీల్‌ వేసింది.

బారాముల్లా, బందిపొరా, గందేర్‌బల్, కుప్వారా జిల్లాల్లోని సుమారు 12 ప్రాంతాల్లో ఉన్న రూ.100 కోట్ల విలువైన ఈ ఆస్తుల్లోకి ప్రవేశించడానికి గానీ, ఎవరూ వినియోగించుకోవడానికి ఇక వీలుండదని అధికారులు తెలిపారు. జేఈఐ తన నిధులను వేర్పాటు వాద కార్యకలాపాల కోసం, జాతి వ్యతిరేక, ఉగ్రవాద కార్యకలాపాల కోసం వినియోగించకుండా ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు. జమ్మూకశ్మీర్‌ వ్యాప్తంగా జేఈఐకి సుమారు 188 ఆస్తులున్నట్లు ఎస్‌ఐఏ గుర్తించింది. వీటిపై విడతల వారీగా చర్యలు తీసుకుంటోంది.

మరిన్ని వార్తలు