రాజాం సిటీ: స్థానిక అంబేడ్కర్ జంక్షన్ వద్ద బుధవారం అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించిన ఆకతాయిలు వీరంగం వేశారు. సుమారు పది మంది వరకు గుంపుగా చేరి రోడ్డుపై వస్తున్న వాహనాలను అడ్డగించారు. దీంతో వాహనదారులతోపాటు ఇతరులు ఇబ్బందులకు గురయ్యారు. నడిరోడ్డుపై ఆకతాయిలు వికృతచేష్టలకు పాల్పడుతుండడంతో పట్టణవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయంపై టౌన్ సీఐ రవికుమార్ వద్ద ప్రస్తావించగా ఆకతాయిలను సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించామని, వారిని స్టేషన్కు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నామన్నారు.