దుబ్బాక ఉపఎన్నిక: బరిలో నిలిచింది వీరే!

19 Oct, 2020 18:39 IST|Sakshi

సాక్షి, సిద్ధిపేట: దుబ్బాక ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. ఇప్పటివరకు అక్కడ మొత్తం 46 నామినేషన్లు దాఖలు కాగా, 11 మంది ఉపసంహరించుకున్నారు. స్క్రూటినీలో 12 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో మొత్తంగా 23 మంది దుబ్బాక ఉప ఎన్నిక బరిలో నిలిచారు. వీరిలో ఎనిమిది మంది పార్టీ గుర్తులతో పోటీ చేస్తున్నవారు ఉండగా, 15 మంది స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగుతున్నారు. (చదవండి: 'అబద్ధాలతో అధికారంలోకి వస్తే ఎండమావే')

పార్టీ గుర్తులతో పోటీ చేస్తున్నవారు
1.  టీఆర్‌ఎస్‌ పార్టీ- సోలిపేట సుజాత
2. కాంగ్రెస్‌ పార్టీ- చెరుకు శ్రీనివాస్‌రెడ్డి
3. బీజేపీ- రఘు నందన్ రావు
4. అల్ ఇండియా ఫార్వార్డ్‌ బ్లాక్- కత్తి కార్తీక
5. జై స్వరాజ్- గౌట్ మల్లేశం
6. శ్రమజీవిపార్టీ- జాజుల  భాస్కర్  
7.   ఇండియా ప్రజా బంద్ పార్టీ- సునీల్
8. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా- సుకురి అశోక్

స్వతంత్ర అభ్యర్ధులు
9. అండర్ఫ్ సుదర్శన్
10.అన్న బుర్ర రవి తేజ గౌడ్
11 అన్న రాజ్
12. కంటే సాయన్న
13. కొట్టాల యాదగిరి  ముదిరాజ్
14. కోట శ్యామ్ కుమార్‌
15. విక్రమ్ రెడ్డి వేముల
16. బండారు నాగరాజ్
17. పీఎం .బాబు
18.బుట్టన్నగారి మాధవ రెడ్డి
19.మోతె నరేష్
20. రణవేని లక్ష్మణ్‌ రావు
21. రేపల్లె శ్రీనివాస్
22 .వడ్ల మాధవాచారి
23. సిల్వెరి శ్రీకాంత్

మరిన్ని వార్తలు