వాలంటీర్లతో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సమావేశం
సాక్షి, చిత్తూరు: ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని.. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. సోమవారం ఆయన వెదురుకుప్పంలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చంద్రబాబు అబద్ధాలకు ఎల్లో మీడియా వంతపాడుతోందని ఆయన దుయ్యబట్టారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో అభివృద్ధి కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబును ప్రజలు ఎప్పుడో మరిచిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. వాలంటీర్ల సేవలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి నారాయణ స్వామి అన్నారు.
చదవండి: ఏపీలో ఈనెల 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు
ఆనందయ్య మందు పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి