సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు: మంత్రి పెద్దిరెడ్డి

31 Oct, 2023 19:14 IST|Sakshi

తిరుపతి జిల్లా: చంద్రబాబుకు ఆరోగ్యం బాగోలేదని నాలుగు వారాలు కండిషన్ బెయిల్ ఇస్తే.. సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇల్లు అలకగానే పండగ చేసుకోవడం కాదని విమర్శించారు. గన్నవరం నుండి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయన చంద్రబాబు బెయిల్ అంశంపై ఈ మేరకు స్పందించారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్‌ లభించిన విషయం తెలిసిందే. రూ.లక్ష పూచీకత్తు, ఇద్దరు షూరిటీలతో నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ మంగళవారం రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయనకు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. 

ఇదీ చదవండి: చికిత్స తర్వాత చంద్రబాబు జైలుకెళ్లాల్సిందే: సజ్జల

మరిన్ని వార్తలు