చంద్రబాబు దళిత వ్యతిరేకి

8 Nov, 2023 04:33 IST|Sakshi

టీడీపీ పాలనలో దళితులపై ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు

హోం మంత్రి తానేటి వనిత మండిపాటు

కొవ్వూరు: టీడీపీ అధినేత చంద్రబాబే పెద్ద దళిత వ్యతిరేకి అని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. టీడీపీ హయాంలో దళితులపై ఎన్నో అరాచకాలు, దాడులు జరిగాయని.. కానీ చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకుండా పంచాయి­తీలు చేశారని మండిపడ్డారు. ఇప్పుడు కంచికచర్ల ఘటనలో నిందితులను అరెస్టు చేసినా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూ­­రులో మంగళవారం ఆమె మీడియాతో మాట్లా­డారు.

ఎన్టీఆర్‌ జిల్లా కంచిక­చర్లకు చెందిన శ్యామ్‌కుమార్‌పై దాడికి పాల్పడిన ఆరుగురు నిందితులను 48 గంటల్లోనే అరెస్టు చేసి.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించా­మని చెప్పారు. అయినప్పటికీ టీడీపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన చూసి టీడీపీ నేతలు తట్టుకో­లేకపోతున్నారని విమర్శించారు.

విద్యార్థుల గొడవకు రాజకీయ రంగు పులిమి లబ్ధి పొందేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. గతంలో సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అంటూ అవహేళన చేశా­రని గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలను దళిత జాతి ఎప్ప­టికీ మరచిపోద­న్నారు. చంద్రబాబు పాలనలో దళి­తు­లపై ఎన్నో అరాచకాలు, దాడులు, అత్యాచా­రా­లు జరిగా­యని.. మహిళా ప్రజాప్రతినిధులపై దాడు­లకు ఒడిగ­ట్టా­రని గుర్తు చేశారు.

టీడీపీ రాష్ట్ర అధ్య­క్షుడు అచ్చెన్నాయుడు దళిత మహిళ కడుపుపై బూటు కాలుతో తన్నారని, అటువంటి నీచ సంస్కృతి టీడీపీదేనని విమర్శించారు. ఇప్పుడు రాజకీయ స్వప్ర­యోజనాల కోసం దళితులపై కపట ప్రేమ చూపి­స్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చు­కుని  సీఎం జగన్‌పై బురద జల్లడం వంటి నీచ రాజ­కీయాలు మానుకోవాలని వనిత హితవు పలికా­రు.

మరిన్ని వార్తలు