సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం.. నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగిసింది. భారీ సంఖ్యలోనే అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నట్లు రిటర్నింగ్ అధికారులు తెలియజేశారు. బుజ్జగింపుల పర్వం, చర్చల నడుమ ప్రధాన పార్టీల రెబల్స్తో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకోవడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.
సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్లో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలు కాగా.. సగానికి సగం అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల స్క్రూటినీ(పరిశీలన) తర్వాత 114 మంది బరిలో ఉండగా.. బుధవారం 70 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. చివరకు.. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత గజ్వేల్ బరిలో 44 మంది అభ్యర్థులు ఉన్నారని రిటర్నింగ్ అధికారి తెలిపారు. గజ్వేల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి తూముకుంట నర్సారెడ్డి పోటీ చేస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్లో రెబల్స్తో అధిష్టానం జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. చాలా స్థానాల్లో రెబల్స్ తమ నామినేషన్స్ వెనక్కి తీసుకున్నారు. సూర్యాపేటలో పటేల్ రమేష్రెడ్డి, జుక్కల్లో గంగారాం, బాన్సువాడలో బాలరాజు, డోర్నకల్లో నెహ్రూనాయక్, వరంగల్ ఈస్ట్లో రాఘవరెడ్డి, ఇబ్రహీంపట్నంలో దండెం రాంరెడ్డి నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
మరోవైపు బీజేపీ రెబల్స్ సైతం భారీ సంఖ్యలోనే నామినేషన్లు వెనక్కి తీసుకున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి స్వయంగా ప్రకటించారు.
నామినేషన్ల పరిశీలన తర్వాత.. 2,898 మంది అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు ఈసీ ఆమోదం పొందాయి. నిబంధనల మేరకు 606 నామినేషన్లు తిరస్కరించినట్లు అధికారులు ప్రకటించారు.
సిద్ధిపేట జిల్లా..
రాజన్న సిరిసిల్ల జిల్లా..
పెద్దపల్లి జిల్లాలో..
నల్లగొండ జిల్లా..
నిజామాబాద్ జిల్లాలో..
కామారెడ్డి జిల్లాలో..
గజ్వేల్తో పాటు సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న రెండో నియోజకవర్గం కామారెడ్డి
నామినేషన్ల స్క్రూటినీ తర్వాత ఈ నియోజకవర్గంలో 58 మంది పోటీలో ఉండగా.. ఇవాళ 19 మంది నామినేషన్ల ఉపసంహరణ
కామారెడ్డి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బీజేపీ నుంచి కె.వెంకట రమణారెడ్డి పోటీలో
►ఉమ్మడి వరంగల్.. 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో 216 మంది పోటీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో..
రంగారెడ్డి జిల్లాలో..