బస్సు యాత్ర విజయవంతం చేయండి

22 Nov, 2023 00:24 IST|Sakshi

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు

వివరించేందుకే..

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక పేదలు, బడుగు వర్గాలు ఎంతో సంతోషంగా ఉన్నాయి. ఆయా వర్గాలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు ఈ బస్సు యాత్ర చేపట్టాం. మంత్రులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు ఈ యాత్రలో పాల్గొంటారు. తొలుత భారీ ర్యాలీ, అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ బస్సు యాత్రను విజయవంతం చేయాలని వివిధ వర్గాల ప్రజలతో పాటు కార్యకర్తలను కోరుకుంటున్నాం.

– బాలినేని శ్రీనివాసరెడ్డి,

మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే

బస్సు యాత్ర విజయవంతం చేయండి

ఒంగోలు నగరంలో బుధవారం జరగనున్న సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలి. బస్సు యాత్రలో అభిమానులు, కార్యకర్తలు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, మహిళలంతా పాల్గొనాలి.

– జంకె వెంకటరెడ్డి,

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

మరిన్ని వార్తలు