రాష్ట్ర స్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఖోఖో పోటీలకు కనిగిరి విద్యార్థినులు | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఖోఖో పోటీలకు కనిగిరి విద్యార్థినులు

Published Wed, Nov 22 2023 12:22 AM

రాష్ట్ర క్రీడా జట్టును అభినందిస్తున్న పీడీ, ప్రిన్సిపాల్‌ తదితరులు - Sakshi

కనిగిరి రూరల్‌: రాష్ట్ర స్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఖోఖో పోటీలకు కనిగిరి ఎమ్మెస్సార్‌ బాలిక కళాశాల విద్యార్థినులు ఎంపికై నట్లు ఖోఖో సంఘ జిల్లా కార్యదర్శి, పీడీ బీ కాశీవిశ్వనాథరెడ్డి తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి బాలికల జట్టుకు ఎమ్మెస్సార్‌ కళాశాలకు చెందిన బీ శ్రీజ, ఆర్‌ యశోద, ఐ సిరి, పీ నందిని, కే ఊహ, జీ భవాని, ఎం సుమతి, ఎం సఖియా, కే వర్షిణి, ఆర్‌ భవ్యశ్రీ, టీ సుస్మిత, కే అఖిల ఎంపికయ్యారు. ఈమేరకు క్రీడాకారులను కళాశాల ప్రిన్సిపాల్‌ టీ వెంకటరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ రాఘవరెడ్డి, సలహాదారు డీ కృష్ణారెడ్డి, ఖోఖో సంఘ జిల్లా కార్యదర్శి బీ కాశీ విశ్వనాథరెడ్డి, కోచ్‌లు, వై శ్రీనివాసులరెడ్డి, బీ నాగలక్ష్మి, ఎం ఆదినారాయణ తదితరులు అభినందించారు.

Advertisement
Advertisement