వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్కు ముందు శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ దసున్ షనకతో పాటు యువ పేసర్ మతీషా పతిరానా గాయం కారణంగా ఆసీస్తో మ్యాచ్కు దూరమయ్యారు. నెట్ప్రాక్టీస్లో షనక మోకాలికి గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు పూర్తిగా ప్రాక్టీస్ సెషన్స్ మొత్తానికి దూరమయ్యాడు.
మరోవైపు పతిరానా భుజం గాయంతో బాధపడుతున్నాడు. పాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా పతిరానాకు భుజానికి గాయమైంది. ఇక ఆసీస్తో మ్యాచ్కు షనక దూరం కావడంతో కుశాల్ మెండిస్ లంక సారధిగా వ్యవహరించనున్నాడు.
షనక స్ధానంలో దుషాన్ హేమంత, పతిరానా స్ధానంలో లహురు కుమార తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ 16న లక్నో వేదికగా ఆసీస్తో శ్రీలంక తలపడనుంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో శ్రీలంక ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైంది.
చదవండి: Ind Vs Pak: పాక్ బ్యాటర్లకు చుక్కలు.. వారెవ్వా.. ఐదుగురు సరిసమానంగా పంచుకున్నారు! అతడొక్కడే పాపం..