India Tour Of South Africa: ఓ పక్క వన్డే కెప్టెన్సీ అంశంపై దుమారం నడుస్తుండగానే.. కోహ్లి నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికాలో ల్యాండైంది. ఇవాళ ఉదయం ముంబై నుంచి ప్రైవేటు విమానంలో జోహన్నెస్బర్గ్కు బయల్దేరిన 18 మంది ఆటగాళ్లతో కూడిన భారత బృందం సాయంత్రానికి అక్కడికి చేరుకుంది. సౌతాఫ్రికా విమానం ఎక్కడానికి ముందు టీమిండియా ముంబైలోని క్వారంటైన్లో మూడు రోజులు గడిపింది. ఆటగాళ్లతో పాటు భారత బృందంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, ఇతర కోచింగ్ సిబ్బంది ఉన్నారు.
📍Touchdown South Africa 🇿🇦#TeamIndia #SAvIND pic.twitter.com/i8Xu6frp9C
— BCCI (@BCCI) December 16, 2021