Women's Asia Cup 2022: మరో విజయమే లక్ష్యంగా... థాయ్‌లాండ్‌తో భారత్‌ ఢీ 

10 Oct, 2022 07:12 IST|Sakshi
PC: ACC

మహిళల ఆసియా కప్‌ టి20 క్రికెట్‌ టోర్నీలో ఇప్పటికే సెమీఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్న భారత జట్టు నేడు తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ జట్టుతో ఆడనుంది.

బంగ్లాదేశ్‌ వేదికగా ఏడు జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం ఐదు మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలు సాధించి, ఒక మ్యాచ్‌లో ఓడింది. మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

తుది జట్లు(అంచనా)
భారత్‌: స్మృతి మంధాన (కెప్టెన్‌), షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్‌ కీపర్‌), కిరణ్ నవ్‌గిరే, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, స్నేహ రాణా, రేణుకా సింగ్, రాజేశ్వరి గయక్వాడ్

థాయ్‌లాండ్‌: నన్నపట్ కొంచరోయెంకై (వికెట్‌ కీపర్‌), నత్తకన్ చంతమ్, నరుఎమోల్ చైవై (కెప్టెన్‌), సోర్నరిన్ టిప్పోచ్, చనిద సుత్తిరువాంగ్, రోసెనన్ కానో, ఫన్నిత మాయ, నట్టయ బూచతం, ఒన్నిచ కమ్‌చోంఫు, బంతిద లీఫత్తానా, తిపట్చా పుట్టావొంగ్
చదవండిసెంచరీతో చెలరేగిన శ్రేయస్‌.. దక్షిణాఫ్రికాపై భారత్‌ ఘన విజయం

మరిన్ని వార్తలు