భారత్‌ను గెలిపించిన శ్రీజేశ్‌ 

12 Feb, 2024 03:46 IST|Sakshi

పురుషుల ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా ఆదివారం భువనేశ్వర్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ‘షూటౌట్‌’లో 4–2తో డిఫెండింగ్‌ చాంపియన్‌ నెదర్లాండ్స్‌కు షాక్‌ ఇచ్చింది. ఈ టోర్నీలో భారత్‌కిది రెండో విజయం.

‘షూటౌట్‌’లో గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ నెదర్లాండ్స్‌ జట్టు రెండు ప్రయత్నాలను నిలువరించి భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega