IPL 2022: ‘అత్యుత్తమ స్పిన్నర్లతో జట్టు రాత మారుస్తాం’ 

18 Mar, 2022 07:26 IST|Sakshi

గత మూడు సీజన్లలో 7, 8, 7 స్థానాలకే పరిమితమైన రాజస్తాన్‌ రాయల్స్‌ ఈసారి మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని జట్టు హెడ్‌ కోచ్‌ కుమార సంగక్కర విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘ప్రపంచ క్రికెట్‌లోని ఇద్దరు అత్యుత్తమ, వైవిధ్యమైన స్పిన్నర్లు అశ్విన్, చహల్‌ మా జట్టులో ఉన్నారు. బౌల్ట్‌ తదితర ఆటగాళ్లు కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. గతంలో చేసిన కొన్ని తప్పులను పునరావృతం చేయకుండా ప్రయత్నిస్తాం’ అని సంగక్కర అభిప్రాయ పడ్డాడు.  

మరిన్ని వార్తలు