అంతర్జాతీయ టీ20ల్లో నమీబియా ఆటగాడు జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్ ఆటగాడు సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ ఆటగాడిగా జాన్ నికోల్ రికార్డులకెక్కాడు. కీర్తిపూర్ వేదికగా నేపాల్తో జరుగుతున్న తొలి టీ20లో కేవలం 33 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. దీంతో కుశాల్ మల్లా పేరిట పేరిట ఉన్న ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ రికార్డును బ్రేక్ చేశాడు. గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో మంగోలియాపై కేవలం 34 బంతుల్లో మల్లా సెంచరీ చేశాడు.
విధ్వంసం..
ఇక మ్యాచ్లో నికోల్ లాఫ్టీ విధ్వంసం సృష్టించాడు. నేపాల్ బౌలర్లను ఈ నమీబియన్ ఊచకోత కోశాడు. ఓవరాల్గా 36 బంతులు ఎదుర్కొన్న లాఫ్టీ ఈటెన్ 11 ఫోర్లు, 8 సిక్స్లతో 101 పరుగులు చేశాడు. అతడితో పాటు కుర్గర్(59) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. వీరిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ల ఫలితంగా నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.