జాతీయ టీటీ విజేత శ్రీజ

3 Dec, 2023 00:29 IST|Sakshi

సాక్షి, విజయవాడ: జాతీయ ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌íÙప్‌ మహిళల సింగిల్స్‌లో తెలంగాణ ప్లేయర్‌ ఆకుల శ్రీజ  విజేతగా నిలిచింది. టోరీ్నలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన శ్రీజ శనివారం జరిగిన ఫైనల్లో 6–11, 9–11, 11–4, 9–11, 11–7, 12–10, 12–10 (4–3) స్కోరుతో అర్చనా కామత్‌ (పెట్రోలియం స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డ్‌)పై విజయం సాధించింది. తొలి నాలుగు గేమ్‌లలో మూడు ఓడి 1–3తో వెనుకబడిన శ్రీజ...ఆ తర్వాత చెలరేగి వరుసగా మూడు గేమ్‌లను గెలుచుకోగలిగింది.

3–3తో సమంగా నిలిచిన తర్వాతి చివరి గేమ్‌లో ఒక దశలో 10–8తో అర్చన విజయానికి చేరువైంది. అయితే వరుసగా నాలుగు పాయింట్లు సాధించి శ్రీజ మ్యాచ్‌ను ముగించింది. పురుషుల సింగిల్స్‌లో మానవ్‌ ఠక్కర్‌ (పీఎస్‌పీబీ)కి టైటిల్‌ దక్కింది. ఫైనల్లో జి.సత్యన్‌ (పీఎస్‌పీబీ)ని ఠక్కర్‌ గెలుపొందాడు. ఐదు గేమ్‌ల తర్వాత 2–3తో వెనుకబడిన తర్వాత ఆరో గేమ్‌లో 0–2 స్కోరు వద్ద వెన్నునొప్పితో సత్యన్‌ మ్యాచ్‌నుంచి వైదొలిగాడు.
 

మరిన్ని వార్తలు