డోపింగ్‌లో పట్టుబడ్డ జాతీయ స్ప్రింట్‌ చాంపియన్‌..

2 Jan, 2022 10:42 IST|Sakshi

అండర్‌–23 విభాగంలో భారత జాతీయ స్ప్రింట్‌ మహిళా చాంపియన్‌ తరణ్‌జీత్‌ కౌర్‌ డోపింగ్‌ పరీక్షలో విఫలమైందని జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) తెలిపింది. ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల తరణ్‌జీత్‌ గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన జాతీయ అండర్‌–23 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్లు, 200 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలు నెగ్గింది. ‘నాడా’ క్రమశిక్షణ కమిటీ విచారణలోనూ తరణ్‌జీత్‌ దోషిగా తేలితే ఆమెపై నాలుగేళ్ల నిషేధం విధిస్తారు.

చదవండి: రషీద్‌ ఖాన్‌ కుటంబంలో తీవ్ర విషాదం..

మరిన్ని వార్తలు