ఆస్పత్రిలో కేసీఆర్‌.. యశోదకు పొన్నం

10 Dec, 2023 12:21 IST|Sakshi
ఫైల్‌ ఫొటో

సాక్షి, హైదరాబాద్‌: మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులను కలిసి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన నియోజకవర్గానికి చెందిన ఓ కాంగ్రెస్‌ కార్యకర్తను పరామర్శించేందుకు వచ్చనట్లు తెలిపారు. అదే సమయంలో మాజీ  సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులను కలిసి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నానని తెలిపారు.

ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని పొన్నం చెప్పారు. కేటీఆర్, హరీష్‌ను కలిసి కేసీఆర్ ఆరోగ్యం గురించి అడిడి తెలుకున్నానని తెలిపారు. ఇక మధ్యాహ్నం  12.30 తరువాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యశోదా ఆస్పత్రికి రాననున్నట్లు అయన వెల్లడించారు. ఇందులో ఎటువంటి రాజకీయాలు లేవని పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు