శీతకాల విడిది.. హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి

3 Dec, 2021 12:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతకాల విడిది కోసం హైదరాబాద్ రానున్నారు. డిసెంబర్ మూడు లేదా నాలుగో వారంలో ఈ పర్యటన ఉండబోతోంది. బొల్లారంలో 90 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. నిరుడు కోవిడ్ కారణంగా రాష్ట్రపతి శీతాకాల విడిదికి రాలేదు. ఈ సారి  రాష్ట్రపతి దక్షిణాది విడిదికి వస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్రపతిభవన్‌ వర్గాలు సమాచారం అందించారు. ఈ విడిదిలో భాగంగా నాలుగైదు రోజులపాటు ఇక్కడి రాష్ట్రపతి నిలయంలో విడిది చేస్తారు.

మరిన్ని వార్తలు