రైతుబంధు చైర్మన్‌గా టి.రాజయ్య బాధ్యతలు

10 Oct, 2023 05:47 IST|Sakshi
రాజయ్యను అభినందిస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రైతు­బంధు సమితి చైర్మన్‌గా తాటికొండ రాజయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ తెలంగాణ రైతుబంధు సమితి సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక అన్నారు.

ఈ సమి­తిలో 1.60 లక్షల మంది సభ్యు­లున్నారని, సీఎం కేసీఆర్‌ సహకారంతో ఈ సంస్థను మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. పదేళ్లలో వ్యవ­సాయ రంగానికి తె­లంగాణ ప్రభు­త్వం ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని, ప్రపంచంలోనే వినూత్న­మైన రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టిందని రాజయ్య పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు