నిరాడంబరంగా డీజీపీ కుమారుడి వివాహం

30 Jul, 2020 08:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి కుమారుడు నితీష్‌ వివాహం బుధవారం రాత్రి నిరాడంబరంగా జరిగింది. దివంగత పి.రామేశ్వర్‌రెడ్డి, మంజుల కుమార్తె వైష్ణవితో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని దస్‌పల్లా హోటల్‌లో ఈ వివాహం జరిగింది. కోవిడ్‌ నిబంధనల్ని పక్కాగా పాటిస్తూ, షేక్‌పేట్‌ తహసీల్దార్‌ అనుమతితో జరిగిన ఈ వేడుకకు వధువరూల కుటుంబీకులతో పాటు అతి కొద్దిమంది ప్రముఖులు మాత్రమే హాజరు అయ్యారు. వధూవరులతో పాటు కుటుంబ సభ్యులు, అతిథులూ మాస్క్‌లు ధరించి, వ్యక్తిగత దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు.

మరిన్ని వార్తలు