నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం

Published on Tue, 06/30/2020 - 05:15

సాక్షి, అమరావతి: రాష్ట్రం లో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కళాశాలలు, సంబంధిత కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. వీటి ద్వారా సుశిక్షితులైన యువతను వివిధ రంగాలకు అందించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న అయిదు రోజుల అధ్యాపక అభివృద్ధి కార్యక్రమాన్ని (ఎఫ్‌డీపీ) ఉద్దేశించి డిజిటల్‌ వేదిక ద్వారా అమరావతి నుంచి సోమవారం మంత్రి సురేష్‌ మాట్లాడారు.

2020–2025 కొత్త ఇన్నోవేషన్‌ పాలసీని ప్రభుత్వం తీసుకురానుందని చెప్పారు. ‘కరోనా కారణంగా పలు రంగాల మాదిరి విద్యా రంగం కూడా సవాళ్ల్లను  ఎదుర్కొంటోంది. పరీక్షలు, తరగతుల నిర్వహణపై అన్ని వర్గాలు మేధావులు తల్లిదండ్రుల అభిప్రాయానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. విభజన అనంతరం రాష్ట్రంలో విద్యారంగానికి, పారిశ్రామిక రంగానికి దూరం కొంత పెరిగింది. దాన్ని అధిగమించే ప్రయత్నం విశ్వవిద్యాలయాలు చేయాలి’ అని మంత్రి సూచించారు. స్టార్టప్‌ ఇంక్యుబేషన్, ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ వంటి అంశాలపై దృష్టి సారిస్తే ఉపాధితో పాటు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ (ఎన్‌ఆర్‌డీసీ, న్యూఢిల్లీ) సీఎండీ డాక్టర్‌ హెచ్‌.పురుషోత్తం సూచించారు.  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ