స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
సాగర్ డ్యామ్లో సగం మాదే...
Published on Fri, 01/23/2015 - 13:23
నాగార్జున సాగర్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో వివాదం నెలకొంది. ఇప్పటికే అనేక అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతుండగా తాజాగా నాగార్జున సాగర్ డ్యామ్ నిర్వహణపై తమకు భాగం ఉందని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదలశాఖ అధికారులు లేఖ రాశారు. ఈ మేరకు ఏపీ అధికారులు రాసిన లేఖను డ్యామ్ అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి తెలియచేశారు.
వివరాల్లోకి వెళితే ఆధునిక దేవాలయం, జాతీయ సంపద అయిన నాగార్జున సాగర్ ప్రాజెక్టను పంచనామా చేసి తమ భాగం తమకు అప్పగించాలని ఏపీ ఇంజినీర్లు గుంటూరు జిల్లా మాచర్ల తహశీల్దార్, సీఐలకు లేఖలు రాశారు. డ్యామ్లో సగభాగం తమదేనని ... 13 గేట్ల నిర్వహణను తామే నిర్వహిస్తామని ఇంజినీర్లు ఆ లేఖలో పేర్కొన్నారు. డ్యామ్లోని తమ భాగం తమకు అప్పగించాలంటూ నీటి పారుదల శాఖ అధికారులు లేఖలు రాశారు.
Tags