ఆ ఘటన విచారకరం: డీజీపీ ఆర్పీ ఠాకూర్‌

Published on Thu, 04/25/2019 - 19:02

విశాఖపట్నం: రుషికొండ రేవ్‌ పార్టీ కేసుపై ఏపీ డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ గురువారం స్పందించారు. ప్రశాంత విశాఖ నగరంలో రేవ్‌ పార్టీ, డ్రగ్స్‌ రావటం విచారకరమన్నారు. రేవ్‌ పార్టీ, డ్రగ్స్‌ కేసులో ఇప్పటివరకు 50 మందిని గుర్తించి, ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. మిగిలిన వారి మీద కూడా కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. డ్రగ్స్‌ సరఫరాదారులపై రౌడీషీట్‌ తరహాలో హిస్టరీ షీట్‌ తెరుస్తామని వెల్లడించారు. డ్రగ్స్‌ మాఫియా అనుసరిస్తున్న పద్ధతిని బ్రేక్‌ చేసే యోచనలో పోలీస్‌ శాఖ కసరత్తు చేస్తోందని తెలిపారు.



డ్రగ్స్‌ వినియోగం ఏ సంస్థలో జరిగినా, స్టార్‌ హోటల్‌ అయినా కూడా వారిపై కేసులు నమోదు చేయడానికి వెనకాడమన్నారు. డ్రగ్స్‌ కంట్రోల్‌పై గెజిటెడ్‌ స్థాయి అధికారి బృందం పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజలు కూడా డ్రగ్స్‌పై తగిన సమాచారాన్ని వాట్సప్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఇవ్వాలని సూచించారు. త్వరలోనే డ్రగ్స్‌ కంట్రోల్‌పై ప్రత్యేకించి టెలీఫోన్‌ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. అంతకుముందు విశాఖ బీచ్‌ రోడ్‌లో శక్తి బృందాలను డీజీపీ ప్రారంభించారు. మహిళల భద్రత కోసం శక్తి బృందాలు పని చేస్తాయని తెలిపారు. ఇప్పటికే విజయవాడలో శక్తి బృందాలు ప్రారంభించామని, త్వరలోనే తిరుపతితో పాటు ముఖ్యమైన ప్రాంతాల్లో శక్తి బృందాలు ఏర్పాటుల చేస్తామని చెప్పారు.

చదవండి: ఈవెంట్ల పేరుతో రేవ్‌ పార్టీలు!

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ