జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బంద్ ప్రశాంతం
Published on Tue, 08/11/2015 - 23:38
{పత్యేక హోదా కోరుతూ ఉద్యమ పథం
వామపక్షాల ఆందోళనకు వైఎస్సార్సీపీ సంఘీభావం
మూతపడిన పాఠశాలలు ఎక్కడికక్కడ అరెస్టులు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ వామపక్షాలు..ప్రజాసంఘాల పిలుపు మేరకు మంగళవారం బంద్ ప్రశాంతంగా జరిగింది. ఈ ఆందోళనకు కాంగ్రెస్..వైఎస్సార్కాంగ్రెస్ మద్దతు పలికాయి. కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో తెలుగుదేశం ఈ విషయంలో మాట తప్పాయంటూ పార్టీ శ్రేణుల నుంచి నిరసన వ్యక్తమైంది. ఉదయం నుంచే పార్టీ శ్రేణులు రోడ్డెక్కాయి. పాఠశాలలు..కళాశాలలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఉదయం బస్సుల రాకపోకలు కాస్సేపు నిలిచిపోయాయి.
పెట్రోల్ బంక్లు మూతపడ్డాయి. సినిమా థియేటర్లలో ఉదయం ఆటలను రద్దు చేశారు. బంద్పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడ ఆందోళనలను అణచివేశారు. నగరంలో 320 మందిని, రూరల్ పరిధిలో 41 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Tags