లోక్‌అదాలత్‌లో బాధితుడికి రూ.కోటి నష్టపరిహారం

Published on Sun, 12/15/2019 - 04:28

కడప అర్బన్‌: వైఎస్సార్‌ జిల్లా కడపలోని ఎన్జీవో కాలనీకి చెందిన ఆర్‌ వీర సుదర్శన్‌రెడ్డికి శనివారం జాతీయ లోక్‌అదాలత్‌లో రూ.కోటి పరిహారం లభించింది. 2015లో ఇంపీరియల్‌ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్‌ ఫారమ్స్‌ సంస్థతో పన్నెండు సెంట్ల స్థలం అగ్రిమెంట్‌ విషయంలో సుదర్శన్‌రెడ్డికి వివాదముంది. దీనిపై ఆయన జిల్లా కోర్టులో కేసు వేశారు. శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ సందర్భంగా జిల్లా కోర్టులోని మొదటి బెంచ్‌లో ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్‌ సమక్షంలో సంస్థ ప్రతినిధులకు సుదర్శన్‌రెడ్డికి మధ్య రాజీ కుదిర్చారు. సుదర్శన్‌రెడ్డికి రూ.కోటి నష్టపరిహారాన్ని వెంటనే అందేలా చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్‌ జిల్లా వ్యాప్తంగా లోక్‌ అదాలత్‌లో పరిష్కారమైన 1446 కేసులలో ఇంత పరిహారం వచ్చిన కేసు ఇదే కావడం విశేషం. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ