amp pages | Sakshi

పై-లీన్.. టెన్షన్

Published on Sat, 10/12/2013 - 03:30

నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: బంగాళఖాతం ఏర్పడిన పెనుతుపాన్ ైపై-లీన్ తీరంవైపు దూసుకొస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం, ఒడిశాలోని పారా దీప్ మధ్య శనివారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి లోపు తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.  జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ క్రమంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాన్ తీరం దాటే సమయంలో 200 నుంచి 225 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో నష్టతీవ్రతను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
 
 ఇప్పటికే కృష్ణపట్నం పోర్టులో మూడో ప్రమాదసూచిక ఎగురవేశారు. జిల్లాలో తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉండే మండలాల అధికారులతో కలెక్టర్ శ్రీకాంత్ తరచూ సంప్రదిస్తున్నారు. మండలాల వారీగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సెట్ ద్వారా తెలుసుకుంటున్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా వారికి సూచనలు ఇస్తున్నారు. తుపాన్ ప్రభావం ఉండే 21 మండలాల్లో 23 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. కావలి, విడవలూరుకు ఇద్దరు చొప్పున అధికారులు నియమితులయ్యారు. 21 మండలాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు.
 
 పత్యేక అధికారులు రాత్రి వేళలో మండలాల్లోనే ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. మత్స్యకారులు చేపల వేటకెళ్లకుండా చర్యలు చేపట్టారు. తీరప్రాంత గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కలెక్టరేట్‌లో కంట్రోలు రూం(0861-2331477) ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో అవసరమైన నిత్యావసర సరుకులు సిద్ధమయ్యాయి. తుపాన్ ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కంట్రోల్ రూంకు తెలియచేయాలని అధికారులు సూచించారు.
 
 విధుల్లో రెవెన్యూ సిబ్బంది
 సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఇప్పటివరకు సమ్మెలో ఉన్న రెవెన్యూ అధికారులు, సిబ్బంది తుపాన్ నేపథ్యంలో విధులకు హాజరయ్యారు. ఏజేసీ పెంచలరెడ్డి, డీఆర్వో రామిరెడ్డి, ఆర్డీఓలు, తహశీల్దార్లు, సిబ్బంది శుక్రవారం విధుల్లో చేరారు.
 
 తీరంలో అప్రమత్తం
 ముత్తుకూరు: పై-లీన్ తుపాన్ తీవ్రత నేపథ్యంలో తీరప్రాంతంలో అధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖపట్టణంలోని వాతావరణ పరిశోధన స్థానం అధికారుల సూచన మేరకు కృష్ణపట్నం పోర్టులో 3వ ప్రమాదసూచికను ఎగురవేశారు. తుపాన్ కారణంగా ఈదురు గాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఈ సూచిక సారాంశం. మరోవైపు సముద్రంలో వేటకు వెళ్లిన మరపడవలు పోర్టుకు చేరాయి. కొన్ని ఫైబర్‌బోట్లను బకింగ్‌హాం కాలువలో కట్టేశారు.
 

Videos

మోదీ ఫోటో లేకుండా చంద్రబాబు 420 మేనిఫెస్టో..

చంద్రబాబుది బోగస్ రిపోర్ట్..

అన్నావదినపై విషం కక్కుతారా..

పింఛన్ దారులకు పెన్షన్ కానుక పంపిణీ..

షర్మిల ఆడియో లీక్

అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్

హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)