కరోనా వైరస్‌పై మంత్రి నాని సమీక్ష..

Published on Tue, 01/28/2020 - 16:26

సాక్షి, అమరావతి : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా  కరోనా వైరస్‌పై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటివరకు కరోనా వైరస్‌కు సంబంధించి రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు.

కరోనా వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బోధన ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో 5 పడకలతో కూడిన ప్రత్యేక వార్డును ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. అలాగే ప్రతి ఆస్పత్రిలో కూడా వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్‌పై తక్షణమే ప్రత్యేక నోడలు అధికారిని నియమించాలన్నారు. 

చదవండి : చైనా నుంచి వచ్చిన రాయచోటి విద్యార్థిని

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ