amp pages | Sakshi

నాలుగో వంతు కరువే!

Published on Thu, 10/17/2013 - 02:01

* 292 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు  
ఈసారీ రైతులకు నిరాశే మిగిల్చిన నైరుతి
 
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది కూడా రైతులకు నిరాశే మిగిల్చాయి. సీజన్ కంటే వారం రోజులు ముందుగానే రాష్ట్రంలో ప్రవేశించి ఆశలు రేకెత్తించినా చివరకు ఉసూరుమనిపించాయి. 292 మండలాల్లో కరువును మిగిల్చి వెళ్లిపోయాయి. గత ఏడాది 234 మండలాల్లో వర్షాభావం ఏర్పడగా ఈ ఏడాది వాటి సంఖ్య మరింత పెరగడం గమనార్హం. నైరుతి సీజన్ సెప్టెంబర్ నెలాఖరుతో ముగిసింది. వర్షపాతం ఆధారంగా ఈ ఖరీఫ్‌లో (జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు) 292 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని విపత్తు నిర్వహణ శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి.

ఈ లెక్కల ప్రకారం ఏడు జిల్లాల పరిధిలో వర్షాభావ పరిస్థితి నెలకొనగా.. 30 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. 262 మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షం కురిసింది. 30 మండలాల్లో సాధారణ సగటు వర్షపాతం కంటే 60 నుంచి 99 శాతం తక్కువ వర్షం కురిసింది. సెప్టెంబర్ చివరినాటికి కురిసిన వర్షపాతం ఆధారంగా ఈ లెక్కలు కట్టారు. వాస్తవానికి సెప్టెంబర్ చివరి పక్షంలో కురిసిన వర్షాలతో రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఖరీఫ్ ముగుస్తున్న సమయంలో కురిసిన ఈ వానలతో పంటలు సాగు కావు.

కరువు మండలాల ఎంపిక ప్రక్రియలో చేసే పంటకోత ప్రయోగాల ప్రకారం రాష్ట్రంలో కరువు మండలాలు 350 నుంచి 400 వరకు ఉంటాయని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జిల్లాల వారీగా చూస్తే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 49 మండలాల్లో కరువు నెలకొంది. పశ్చిమగోదావరిలో 32 మండలాల్లో, విశాఖపట్నం జిల్లాలో 31 మండలాల్లోనూ వర్షాభావ పరిస్థితి ఏర్పడింది. మొత్తమ్మీద రాష్ట్రంలో 1,128 మండలాలు ఉండగా (292 మండలాల్లో) నాలుగోవంతు ప్రాంతంలో దుర్భిక్ష పరిస్థితులే నెలకొన్నాయి.

వైఎస్సార్, చిత్తూరు, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఈ ఖరీఫ్ సీజన్‌లో సాధారణ సగటు వర్షపాతం కంటే తక్కువ వర్షం కురిసింది. సీమాంధ్ర జిల్లాల్లో ప్రభుత్వ సిబ్బంది సమ్మెలో ఉన్నందున క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుని కరువు మండలాలు ప్రకటించడంలో తీవ్ర జాప్యం జరిగే అవకాశముంది.
 

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)