తూర్పులో సమైక్య సెగలు

Published on Wed, 08/28/2013 - 10:52

సమైక్యాంధ్రకు మద్దతుగా తూర్పు గోదావరి జిల్లాలో సమైక్య సెగలు మిన్నంటాయి. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆమరణ నిరాహరదీక్షలు చేపట్టారు. జగన్ దీక్షకు మద్దతుగా ముమ్మిడివరంలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్ష బుధవారం 5వ రోజుకు చేరింది. అలాగే అయినవల్లి మండలం ముక్తేశ్వరంలో మందపాటి కిరణ్కుమార్ చేపట్టిన దీక్ష 2 రోజుకు చేరుకుంది. వీటీతోపాటు ఉప్పలగుప్తంలో కమిడి చిన్నపరాజు చేపట్టిన దీక్ష కూడా రెండవ రోజుకు చేరుకుందన్నారు.

 

అయితే జగన్ దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం గోదావరి నదిలో జలయాత్ర చేపట్టింది. మధ్యాహ్నం గంటి పెదపూడి నుంచి పి.గన్నవరం వరకు ఆ యాత్ర కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనాయి. సరైన ప్రయాణ సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే విద్యాసంస్థలకు యాజమాన్యం సెలవులు ప్రకటించారు. దుకాణదారులు స్వచ్ఛందంగా తమ వ్యాపార సంస్థలను మూసివేశారు.

 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ