amp pages | Sakshi

మళ్లీ మైదానానికి

Published on Sun, 04/01/2018 - 10:35

హిరమండలం /ఎల్‌.ఎన్‌.పేట: ఆపరేషన్‌ గజ విజయవంతమైందని సంతోషం వ్యక్తం చేసిన అటవీశాఖ సిబ్బందికి ఎనిమిది ఏనుగుల గుంపు శనివారం తెల్లవారుజాముకే షాకిచ్చాయి. శుక్రవారం చీకటి పడే సమయానికి ఎల్‌.ఎన్‌.పేట మండలం మల్లికార్జునపురం సమీపంలో కొండల్లోకి వెళ్లిన ఈ ఏనుగుల గుంపు శనివారం తెల్లవారే సరికి మండలంలోని మిరియాపల్లి, లక్ష్మీనర్సుపేట గ్రామాల మధ్యలో దర్శనమిచ్చాయి. రాత్రే కొండ దిగి మైదాన ప్రాంతానికి చేరుకున్నాయి. శుక్రవారం రాత్రి ఏనుగుల గుంపు రావిచెంద్రి, డొంకలబడవంజ గ్రామాల మధ్య నుంచి వెళ్లిపోయాయి. పొలంలోనే బస్తాలతో ఉన్న డొంకలబడవంజ గ్రామం గేదెల రామారావు అనే రైతుకు చెందిన ఎనిమిది బస్తాల ధాన్యం తినేశాయని రైతు స్థానిక విలేకరులకు చెప్పారు.

రావిచెంద్రి, ధనుకువాడ గ్రామాల పక్కనుంచి మిరియాపల్లి తోటల్లోకి చేరుకున్న ఏనుగులు శనివారం తెల్లవారు జామున మిరియాపల్లి, లక్ష్మీనర్సుపేట గ్రామాల మధ్య నుంచి వంశధార నదిని దాటుతూ హిరమండలం మండలంలోని రెల్లివలసకు చేరుకున్నాయని అటవీ శాఖ సరుబుజ్జిలి సెక్షన్‌ అధికారి రామలింగేశ్వరరావు, ఎఫ్‌బీఓ పి.లక్ష్మణమూర్తి చెప్పారు. హిరమండలం మండలంలోని అంబావల్లి, పిండ్రువాడ, పిండ్రువాడ కాలనీ సమీప ప్రాంతాల మీదుగా వెళ్లిన ఏనుగులు అక్కడ జీడి, మామిడి తోటలు, జొన్న పంటలను ధ్వంసం చేశాయి. కోదురు సమీపంలోని ఎలుకల మెట్ట కొండపైకి చేరి తిష్ఠవేశాయి.

రెండో రోజూ ‘ఆపరేషన్‌ గజ’
మైదాన ప్రాంతానికి దిగిపోయిన ఎనిమిది ఏనుగుల గుంపును అటవీ ప్రాంతానికి తరలించేందుకు రెండో రోజైన శనివారం ‘ఆపరేషన్‌ గజ’ చేపట్టారు. చిత్తూరు జిల్లా నుంచి తీసుకువచ్చిన వినాయక, జై అనే రెండు ఏనుగులతో పాటు వచ్చిన మావటీలను అప్రమత్తం చేశారు. అప్పటికే మల్లికార్జునపురం వద్ద ఉన్న వినాయక, జై ఏనుగులను అలికాం–బత్తిలి రోడ్డు మీదుగా నడిపించుకుంటూ హిరమండలం మండలంలోని భగీరథపురం వరకు తీసుకుని వెళ్లారు. అక్కడ నుంచి ఏనుగుల గుంపును అనుసరిస్తూ ఎలుకల మెట్ట ప్రాంతానికి చేరుకున్నారు. సాయంత్రం సారవకోట మండలంలోని మాళువ వైపు తరలివెళ్లాయి.

 అయితే అటవీ అధికారులు పటిష్టమైన వ్యూహంతో వ్యవహరించి ఏనుగులు తరిమేటప్పుడు గ్రామాల్లోకి ప్రవేశించకుండా నాలుగువైపులా మంటలు పెట్టి బాణసంచా కాల్చి బెదిరించారు. జర్జంగి, పిండ్రువాడ రహదారిపై వాహనాలను, ప్రజలను తిరగకుండా నిలిపివేశారు. విశాఖ పట్టణం సర్కిల్‌ సీసీఎఫ్‌ రాహుల్‌ పాండే, శ్రీకాకుళం, విజయనగరం, డీఎఫ్‌వోలు సీహెచ్‌ శాంతి స్వరూప్, లక్ష్మణ్‌ జూ వైద్యులు నవీన్, శ్రీనివాస్, పాతపట్నం, పాలకొండ, కాశీబుగ్గ ఎఫ్‌ఆర్‌వోలు సోమశేఖర్, జగదీష్, అరుణ ప్రకాష్, లక్ష్మినర్సింహ  పర్యవేక్షణలో దాదాపు వంద మంది అటవీ శాఖ సిబ్బందితో ఈ ఆపరేషన్‌ గజ నిర్వహించారు. అటవీశాఖ సిబ్బందిని టీములుగా నియమించి ఏనుగులు వెళుతున్న దిశలో ఉన్న గ్రామాల్లోని ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసే విధంగా చర్యలు తీసుకొన్నారు.

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)