amp pages | Sakshi

కలుషితమైన విందు భోజనం

Published on Mon, 06/25/2018 - 08:32

పులిచెర్ల(కల్లూరు): మండలంలోని పూరేడువారిపల్లెలో ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన విందు భోజనాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆహారం కలుషితం కావడంతో 80 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వివిధ ఆస్పత్రులకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. పులిచెర్ల మండలం పాతపేట పంచాయతీ పూరేడువారిపల్లెలో కొత్తగా నిర్మించిన రామాలయాన్ని శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బంధువులను పిలిపిం చుకుని వారికి శనివారం విందు భోజనాలు ఏర్పాటుచేశారు. ఉదయం టిఫిన్‌లో భాగంగా ఉప్మా, పొంగళి, మధ్యాహ్నం భోజనాలు వడ్డించారు. అం దరూ వారి గ్రామాలకు వెళ్లిపోయారు. సాయంత్రానికి ఒక్కొక్కరికి వాంతులు, విరేచనాలు కావడంతో ఆస్పత్రులకు పరుగులు తీశారు. దీంతో గ్రామస్తులు 108కు సమాచారమందించారు. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో మూడు అంబులెన్స్‌లలో బాధితులను పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

పూరేడువారిపల్లెలో వైద్య శిబిరం
బాధితుల సంఖ్య పెరగడంతో ఆదివారం ఉదయం వైద్యాధికారులు పూరేడువారిపల్లెలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందించారు. విందుకు విచ్చేసిన పింఛా, పాకాల, మొగరాల వాసులు కూడా అస్వస్థతకు గురికావడంతో వారు సమీపంలోని ఆస్పత్రుల్లో చేరారు. పీలేరు ఆస్పత్రిలో 52 మంది, పూరేడువారిపల్లె 15 మంది, దామల్‌ చెరువు ఆస్పత్రిలో 13 మంది చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌ సీపీ చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌ జంగాలపల్లె శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి పోకల అశోక్‌కుమార్‌ పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించా లని ఆదేశించారు. విషయం తెలుసుకున్న డీఎం హెచ్‌వో విజయగౌరి, డీసీహెచ్‌ఎస్‌ సరళాదేవి, డీపీవో సురేష్‌ నాయుడు, ఆస్పత్రికి చేరుకుని పరిశీలించారు. రోగులతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని చెప్పారు.

ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
ఆహారం కలుషితం కావడంతోనే వాంతులు, విరేచనాలు అయ్యాయని డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపా రు. బాధితులను అబ్జర్వేషన్‌లో ఉంచామని, ప్రç Ü్తుతం ఎవరికీ ఇబ్బందికర పరిస్థితి లేదని పేర్కొన్నారు. అలాగే ఆహారం కలుషితం కావడానికి గల కారణాలను తెలుసుకునేందుకు శాంపిల్స్‌ను పరీక్షకు పంపించామన్నారు. ఎమ్మెల్యే వెంట పులిచెర్ల ఎంపీపీ మురళీధర్, ఏటీ రత్నశేఖర్‌రెడ్డి, కేవీపల్లె జెడ్పీటీసీ జి.జయరామచంద్రయ్య, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనరు మురళీమోహన్‌ రెడ్డి, సురేంద్రనాథరెడ్డి, సౌకత్‌ ఆలీ, శ్రీనివాసులు, నటరాజ, గోవిందరెడ్డి, పోకల చంద్ర తదితరులు ఉన్నారు. కల్లూరు ఎస్‌ఐ విశ్వనాథనాయుడు తన సిబ్బందితో రోగులను సకాలంలో ఆస్పత్రికి తరలించడంలో అప్రతమత్తంగా వ్యవహరించారు.

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)