భారీ వర్షానికి ముగ్గురి దుర్మరణం

Published on Wed, 06/04/2014 - 01:39

గోకులపాడు(కల్లూరు), న్యూస్‌లైన్: సమయానికి పరీక్షకు హాజరుకావాలన్న ఆతృత ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులతో పాటు విద్యార్థిని తండ్రిని బలిగొంది. ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు వెళ్తుండగా మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ఉప్పొంగిన వక్కెర వాగు వీరిని కబళించింది. ఈ ఘటన కల్లూరు మండలంలోని గోకులపాడు గ్రామంలో విషాదం నింపింది.

వివరాల్లోకి వెళితే..
గ్రామానికి చెందిన కురువ సుశీల(17), హరిజన కళావతి ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఫెయిలయ్యారు. సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు కర్నూలుకు ప్రయాణమయ్యారు. గ్రామ శివారులోని వక్కెర వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో సుశీల తండ్రి  నారాయణ(55) వీరి వెంట వెళ్లారు. వీరు వాగు వద్దకు చేరుకునే సరికి అదే గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు అదుపుతప్పి వాగులో పడిపోయారు. తల్లీకూతుళ్లు రాములమ్మ, సునీత సమీపంలోని పెంచికలపాడులో ఉన్న కేన్సర్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు.. లక్ష్మీదేవి అనే మహిళ కర్నూలులోని రైస్ మిల్లులో పనిచేసేందుకు వెళ్తుండగా ప్రమాదం బారిన పడ్డారు.

 అదే సమయంలో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు ఇస్మాయిల్, ఎర్రన్న వీరిని ఒడ్డుకు చేర్చడంతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే పరీక్షకు ఆలస్యమవుతుందన్న తొందరలో విద్యార్థులతో పాటు వాగు దాటించేందుకు వచ్చిన తండ్రి నీటిలో కొట్టుకుపోయారు. వీరి వెనకాలే వస్తున్న నారాయణ అల్లుడు రామాంజనేయులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత గ్రామానికి చెందిన యువకులు మూడు బృందాలుగా గాలింపు చేపట్టారు. సల్కాపురం రహదారి వద్ద ముళ్లపొదల్లో నారాయణ మృతదేహం.. మరికొంత దూరంలో కళావతి, సుశీల మృతదేహాలను గుర్తించి బయటకు తీసుకొచ్చారు.

అక్కడి నుంచి ముగ్గురి మృతదేహాలను గోకులపాడు శ్మశాన వాటికకు తరలించారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రి వైద్యులు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత గ్రామస్తుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు చేపట్టారు. ఇదిలా ఉండగా మృతుడు కురువ నారాయణ, కాశమ్మ దంపతులకు ఐదుగురు ఆడ పిల్లలు, ఇద్దరు మగ పిల్లలు సంతానం. నలుగురు ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేయగా.. కుమార్తె సుశీలతో పాటు ఇరువురు కుమారులను కూలి పనులు చేస్తూ చదివిస్తున్నారు. హరిజన బజారి, నాగశేషమ్మ దంపతుల సంతానమైన కళావతి, సుశీల ఇద్దరూ ప్రాణ స్నేహితులు. గ్రామంలో ఇరువురూ కలసి 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత కర్నూలులోని కేవీఆర్ కళాశాలలో సుశీల హెచ్‌ఈసీ గ్రూపు, కళావతి బైపీసీ గ్రూపులో చేరారు. ఇటీవల విడుదలైన మొదటి సంవత్సరం ఫలితాల్లో కొన్ని సబ్జెక్టులు ఫెయిలవడంతో ఇద్దరూ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నారు. ఈ నేపథ్యంలో వాగు దాటుతూ మృత్యువాత పడటం గ్రామస్తులను విషాదంలోకి నెట్టింది.

Videos

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

మన ప్రశ్నలకు బాబు, పురందేశ్వరి, పవన్ కు పిచ్చి, పిచ్చి కోపం వస్తుందంటా..!

Photos

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)