పరిశ్రమల రీస్టార్ట్‌కు ఎన్‌వోసీ తప్పనిసరి

Published on Sat, 04/25/2020 - 04:26

సాక్షి, అమరావతి/నెల్లూరు (సెంట్రల్‌): లాక్‌డౌన్‌ సమయంలో గ్రీన్‌జోన్‌లో ఉన్న పరిశ్రమలు రీస్టార్ట్‌ పథకం కింద తిరిగి ప్రారంభించడానికి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌వోసీ) ఉండాల్సిందేనని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నెల్లూరు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని వివిధ పారిశ్రామిక సంఘాలు, పారిశ్రామిక శాఖ అధికారులతో ‘రీస్టార్ట్‌’ నిబంధనల అమలుపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.  

► పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఆగిపోయిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి రీస్టార్ట్‌ కింద గ్రీన్‌జోన్‌లో ఉన్న పరిశ్రమలను నెమ్మదిగా ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.  
► గురువారం నాటికి 812 కంపెనీలు ఎన్‌వోసీకి దరఖాస్తు చేసుకోగా అందులో ఇప్పటి వరకు  138 సంస్థలకు అనుమతి ఇచ్చామని, 585 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు అధికారులు వివరించారు.  
► పరిశ్రమలు తిరిగి ప్రారంభించడంలో ఎదురవుతున్న సమస్యలపై ఫిక్కీ, సీఐఐ, ఎఫ్‌ఏపీఎస్‌ఐఏ, ఎలీప్, ఫెర్రో అల్లాయీస్, స్పిన్నింగ్‌ మిల్స్‌ అసోసియేషన్స్‌ ప్రతినిధులను మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ