26, 27 తేదీల్లో ‘జన్‌కల్యాణ్ సర్వ్: బీజేపీ

Published on Mon, 05/25/2015 - 00:21

 విజయనగరం అర్బన్: ప్రధాని మోడీ ఏడాది పాలనను పురస్కరించుకొని ఈ నెల 26, 27వ తేదీల్లో  ‘జన్ కల్యాణ్ సర్వ్’ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామని బీజేపీ జిల్లా కమిటీ నిర్ణయించింది. స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ప్రటించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బవిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ 26న జిల్లావ్యాప్తంగా తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో విజయోత్సవాలను జరుపుకుంటామని తెలిపారు.
 
 అదే విధంగా ఈ నెల 27న జిల్లా కేంద్రంలో ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు జరిగే కార్యక్రమానికి మాజీ మంత్రి కావూరి సాంబశివరావు హాజరవుతున్నారని తెలిపారు. గతంలో ఏ ప్రధానీ చేయని అభివృద్ధిని ఒక ఏడాదిలో మోడీ చేసి చూపించారని, ఈ విషయాన్ని క్షేత్ర స్థాయిలో ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నేతలు పాకలపాటి సన్యాసిరాజు, డాక్టర్ పెద్దింటి జగన్మోహనరావు, ఇందుకూరి రఘురాజు, నిమ్మక జయరాజ్, పీవీవీ గోపాలరాజు, పి.అశోక్, ఎం.మధు, కెఎన్‌ఎం కృష్ణారావు, కుసుమంచి సుబ్బారావు, లక్ష్మీనరసింహం తదితరులు పాల్గొన్నారు.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ