Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రజా ఉద్యమాలకు ఇదే అదును, కదలండి!
Published on Tue, 02/13/2018 - 02:04
భీమవరం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘రాష్ట్ర ప్రజల్లో అసహనం పెరుగుతోంది. నాయకత్వం అందిపుచ్చుకోవాలి. లేకుంటే ప్రజలు ఛిన్నాభిన్నం అయిపోతారు. ఉద్యమాలకు ఇదే సమయం, నాయకత్వం మరింత రాటుదేలాలి’’ అని సీపీఎం జాతీయ నేతలు కారత్,రాఘవులు రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేశారు.
ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని వినియోగించుకుని బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించేందుకు నడుం కట్టాలని సూచించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మూడు రోజులుగా జరుగుతున్న సీపీఎం రాష్ట్ర 25వ మహాసభలు కొత్త కార్యవర్గం ఎన్నికతో సోమవారం ముగిశాయి. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పి.మధు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
#
Tags