ఏపీకి సంపూర్ణ సహకారం : మోదీ

Published on Sun, 06/09/2019 - 18:32

తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా చేయూత ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. ఏపీలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలో బలమైన ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. వైఎస్‌ జగన్‌ తన ఆకాంక్షలకు అనుగుణంగా, తన సంకల్పంతో మంచి పరిపాలన అందించాలని ఆకాంక్షించారు. ఏపీలో అభివృద్ధికి అన్ని అవకాశాలున్నాయని అన్నారు. తిరుపతి సమీపంలోని రేణిగుంటలో ఆదివారం జరిగిన ప్రజా ధన్యవాద సభలో మోదీ ప్రసంగించారు.

ఏపీ అన్నిరంగాల్లో దూసుకుపోతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు.  రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఏపీ అభివృద్ధికి కలిసి ముందుకు సాగుతాయని అన్నారు. ఏపీ ప్రజలు విజ్ఞానవంతులని ప్రధాని కొనియాడుతూ స్టార్టప్‌ కార్యక్రమంలో ఎంతో నిష్ణాతులైనవారు రాష్ట్రం నుంచి పెద్దసంఖ్యలో ముందుకొచ్చారని అన్నారు.


ప్రజలు మెచ్చే పాలన..
రాబోయే రోజుల్లో ప్రజలు మెచ్చే పాలనను దేశానికి అందిస్తామని చెప్పారు. ప్రజల హృదయాలు గెలుచుకునేందుకు 365 రోజులు పనిచేస్తామని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంకన్న ఆశీర్వాదం కోసం వచ్చానని చెప్పారు. 130 కోట్ల ప్రజల కలలను సాకారం చేయాలని బాలాజీని వేడుకుంటానని అన్నారు. తమిళనాడు, ఏపీలో బీజేపీ మున్ముందు మరింతగా బలపడుతుందని చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లుగా తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమలే తమకు ఇంతటి ఘనవిజయం సాధించిపెట్టాయని చెప్పారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ