వర్షం కురిసే..పొలం పిలిచే..

Published on Mon, 06/24/2019 - 07:36

సాక్షి, కర్నూలు : కొంత కాలంగా అలకబూనిన వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. రైతులు పంట సాగుకు పొలం బాట పడుతున్నారు. మూడు రోజుల నుంచి కోడుమూరు నియోజకవర్గంలోని కర్నూలు, గూడూరు, బెళగల్, కోడుమూరు మండలాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంతో వ్యవసాయ పనుల్లో రైతన్నలు నిమగ్నమయ్యారు. ఈఏడాది నియోజకవర్గంలో ఎక్కువగా పత్తి, వేరుశనగ, కందులు, ఉల్లి, శనగ, మొక్కజొన్న, పంటలను సాగు చేస్తున్నారు.

నకిలీ విత్తనాలతో బెంబేలు .. 
పంటలు సాగు చేసుకోవడానికి అవపసరమైన విత్తనాల కోసం రైతులు ఫర్టిలైజర్‌ దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని కంపెనీ యజమానులు ఆసరా చేసుకుని నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. గతంలో ప్రైవేట్‌ ఏజెన్సీల ద్వారా అలాంటి విత్తనాలు    అమ్మి రైతన్నలను మోసం చేశారు.  ఈ ఏడాది మళ్లీ అలాంటి మోసం జరగకుండా  వ్యవసాయ అధికారులు చర్యలు చేపటాలని పలువురు రైతులు కోరుతున్నారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ