వీడ్కోలు వందనం స్వీకరించిన దినేష్ రెడ్డి

Published on Mon, 09/30/2013 - 09:07

హైదరాబాద్ : డీజీపీ దినేష్ రెడ్డి పదవీ కాలం నేటితో ముగియనున్న సందర్భంగా ఆయన సోమవారం వీడ్కోలు వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీస్‌గ్రౌండ్స్‌లో పోలీస్‌ విభాగం కవాతు నిర్వహించి ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ కార్యక్రమానికి  అందరూ ఐపీఎస్‌లు, అడిషనల్‌ డీజీలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా దినేష్ రెడ్డి మాట్లాడుతూ డీజీపీగా రెండేళ్ల మూడు నెలలు పని చేశానన్నారు. తాను బాధ్యతలు చేపట్టినప్పుడు రాష్ట్రం అల్లకల్లోలంగా ఉందని.... అయితే అందరి సహకారంతో శాంతిభద్రతలు అదుపులోకి తీసుకు వచ్చినట్లు దినేష్ రెడ్డి తెలిపారు.  దేశంలో  ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ విభాగం గొప్పగా పని చేస్తోందని చెప్పారు. తన పదవీ కాలంలో శాంతి భద్రతలు కాపాడటానికి సహకరించిన పోలీసులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ