పాడేరు సిబ్బందిని చూసి నేర్చుకోండి

Published on Sat, 09/22/2018 - 07:09

విశాఖపట్నం, మల్కాపురం : జీవీఎంసీ 47వ వార్డు గుల్లలపాలెంలోని జీవీఎంసీ (రెడ్‌క్రాస్‌)ఆస్పత్రి వైద్య సిబ్బంది పని తీరుపై జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆగ్రహం చెందారు. ‘ఇంత మంది ఉండి కూడా గర్భిణులకు ప్రసవాలు ఎందుకు చేయడం లేదు, పైన ఉన్న పిల్లల వార్డులో సేవలందించడం లేదెందుకు’ అని ప్రశ్నించారు. పారిశ్రామిక ప్రాంతంలో డెంగ్యూ పరిస్థితి తెలుసుకునేందుకు శుక్రవారం కలెక్టర్‌ ఈ ప్రాంతానికి వచ్చారు. జీవీఎంసీ ఆస్పత్రిని సందర్శించి జ్వరపీడితుల సమస్యలు, ఓపీ రికార్డులు పరిశీలించారు.

ఆస్పత్రి పైన ఉన్న చిల్డ్రన్‌ వార్డును ఎందుకు నిరుపయోగంగా ఉంచుతున్నారని అడగ్గా సిబ్బంది కొరత అని చెప్పుకొచ్చారు. ఇక్కడ స్టాఫ్‌ నర్స్‌లు ఎంతమంది ఉన్నారని కలెక్టర్‌ ప్రశ్నించగా, ముగ్గురు అని సమాధానం వచ్చింది. పాడేరు ఆస్పత్రిని చూడండి, కేవలం ఒక్క స్టాఫ్‌ నర్స్‌ మాత్రమే సేవలందిస్తున్నారు, ఆమె వైద్య సేవలు రోగులకు ఎంతో సంతృప్తినిస్తున్నాయన్నారు. జీవీఎంసీ కమిషనర్‌ హరినారాయణన్, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ హేమంత్‌ కుమార్, అసిస్టెంట్‌ మెడికల్‌ హెల్త్‌ అధికారి డాక్టర్‌ మురళీమోహన్, డీఎంహెచ్‌వో రమేష్‌  పాల్గొన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ