amp pages | Sakshi

ప్రతి గ్రామంలో 150 మొక్కలు నాటిస్తాం

Published on Sun, 09/29/2019 - 12:34

సాక్షి, భీమవరం: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థలో భాగంగా అక్టోబర్‌ 2న నరసాపురం మండలం పెదమైనవానిలంక గ్రామంలో  సచివాలయ నూతన భవనాన్ని ప్రారంభిస్తున్నట్టు ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు చెప్పారు. శనివారం భీమవరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. అదేరోజు హరితభారత్‌ కార్యక్రమంలో భాగంగా నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు రఘురామకృష్ణంరాజు చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని  మహత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా తాను నియోజకవర్గం పరిధిలోని ప్రతి గ్రామంలో 150 మొక్కలు చొప్పున నాటించనున్నట్లు తెలిపారు.

విద్యాసంస్థల్లో కూడా మొక్కలు నాటించే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు చేతుల మీదుగా ప్రత్యేకంగా ప్రశంసాపత్రాలు అందిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ పాలనలో మొక్కలు పెంపకం పేరుతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. ప్రస్తుతం నిధులు దుర్వినియోగానికి అవకాశం లేకుండా మొక్కలను మాత్రమే ప్రభుత్వం సరఫరా చేస్తుందని వాటి సంరక్షణను ప్రజలు స్వచ్ఛందంగా చేపట్టాలన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు దృష్ట్యా కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. దీనిలో భాగంగానే  మొక్కల పెంపకంలో పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తయారుచేయడానికి అన్నివర్గాల ప్రజలు సహకరించాలని ఎంపీ కోరారు. అనంతరం వివిధ మండలాల అధికారులతో మొక్కలు నాటే కార్యక్రమానికి సంబంధించి సమీక్షించారు. విలేకరుల సమావేశంలో పాలకొల్లు నియోజకవర్గ వైఎస్సార్‌ ఇన్‌చార్జ్‌ కవురు శ్రీనివాస్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు గాదిరాజు లచ్చిరాజు పాల్గొన్నారు.

 

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)