ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలం : ఆర్కే రోజా

Published on Fri, 04/10/2020 - 14:07

సాక్షి, తిరుపతి : ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని ఏపీఐఐసీ ఛైర్మన్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటూ గాలికబుర్లు చెబుతున్నారన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి, ప్రజలకు, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని సూచించారు.

చంద్రబాబు బాబు గెలిచిన కుప్పంలో, లోకేష్ ఓడిపోయిన మంగళగిరిలో ప్రజలకు వైఎస్ఆర్‌సీపీ నేతలే అండగా ఉంటున్నారని రోజా తెలిపారు. ఏపీలో ఆర్థిక లోటు ఉన్నా ఉచితంగా రేషన్ ఇచ్చి పేదలను ఆదుకున్నామని చెప్పారు. కరోనాను కూడా ఆరోగ్యశ్రీకి తెచ్చిన గొప్ప నేత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని పేర్కొన్నారు. కరోనా కట్టడి కోసం వైఎస్‌ జగన్ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ