త్వరలో ‘గ్లోరీ ఆఫ్‌ లార్డ్‌ వేంకటేశ్వర’ పుస్తకావిష్కరణ

Published on Mon, 07/02/2018 - 04:44

సాక్షి, అమరావతి: శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో తాను రచించిన ‘గ్లోరీ ఆఫ్‌ లార్డ్‌ వేంకటేశ్వర’పుస్తకాన్ని త్వరలోనే ఆవిష్కరించనున్నట్టు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి వెల్లడించారు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, గుజరాతీ భాషల్లో ఈ పుస్తకం వెలువడుతుందని ఆదివారం ఆయన ట్వీటర్‌లో పేర్కొన్నారు. వేంకటేశ్వరస్వామి మహత్మ్యం, స్వామి ఆలయ విశిష్టత, ఆచారాలు, సంప్రదాయాలపై ఈ పుస్తకం రచించినట్లు తెలిపారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ‘ఈ ఏడాది మనకు చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్‌ పురోగతి సాధించాలంటే జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలి. మనం శాయశక్తులా కృషి చేసి ఈ కలను సాకారం చేసుకుందాం’ అని విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.   

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ