పుట్టెడు దుఃఖం దిగమింగి.. పరీక్షకు హాజరు

Published on Wed, 03/21/2018 - 12:13

ఓబులవారిపల్లె :  తండ్రి మరణించిన పుట్టెడు దుఃఖంలోనూ ఓ విద్యార్థిని పదో తరగతి పరీక్ష రాసింది. చిన్నఓరంపాడు కస్తూరిబాగాంధీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న మణెమ్మ తం డ్రి పులి మునెయ్య (55) గుండెపోటుతో సోమవా రం మృతిచెందాడు. పుల్లంపేట మండలం అనాసముద్రం దళితవాడ గ్రామానికి చెందిన మునెయ్య వ్యవసాయ కూలీ. ఆయనకు ఐదుగురు సంతానం. వారిలో ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. రెండో సంతానం మణెమ్మను కస్తూరిబాగాంధీ పాఠశాలలో చేర్పించారు. మునెయ్య గుండెపోటుతో మృతి చెందాడనే విషయాన్ని తెలుసుకున్న ప్రధానోపాధ్యాయురాలు వరలక్ష్మి మంగళవారం ఉదయం వాహనంలో అనాసముద్రానికి తీసుకుని వెళ్లి తండ్రి మృతదేహాన్ని చూపించారు. తర్వాత స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు తీసుకొచ్చి పదో తరగతి ఇంగ్లిష్‌ పరీక్షకు హాజరు పరచారు. ఆ విద్యార్థినిని తోటి విద్యార్థినులు, ఉపాధ్యాయులు పరామర్శించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ