జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
సీమలో రేపు, ఎల్లుండి పిడుగులు పడే అవకాశం
Published on Mon, 04/15/2019 - 09:57
సాక్షి, విశాఖపట్నం: రాయలసీమలో మంగళ, బుధవారాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. అదే సమయంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కూడా కురవవచ్చని తెలిపింది. అలాగే రానున్న రెండు రోజులు రాయలసీమలో సాధారణంకంటే 2–3 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.
మరోవైపు ఈ నెల 18 నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచించారు.
#
Tags