యాచకుడి విరాళం రూ.లక్ష 

Published on Fri, 07/06/2018 - 02:34

మధురానగర్‌ (విజయవాడ సెంట్రల్‌): విజయవా డ ముత్యాలంపాడులోని షిర్డీసాయిబాబా మంది రానికి ఓ యాచకుడు భా రీగా విరాళం ఇచ్చాడు. సాయిబాబా సమాధి చెంది వంద ఏళ్లు పూర్తవు తున్న సందర్బంగా షిర్డీ సాయిబాబా మందిరం లో ఈనెల 26వ తేదీన నిర్వహించ నున్న లక్ష నారికేళ జలాభిషేకంకు యాచకుడు యడ్ల యాది రెడ్డి రూ.1,08,000 విరాళంగా అందజేశాడు. మందిర గౌరవాధ్యక్షుడు గౌతంరెడ్డి మాట్లా డుతూ.. యాదిరెడ్డి ఇప్పటికే ఆలయంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి వెండి ఆభరణాలు చేయించటమే కాకుండా నిత్య అన్నదానానికి రూ.లక్ష విరాళం అందజేసినట్లు గుర్తు చేశారు. యాదిరెడ్డి మాట్లాడుతూ.. తనకు భక్తులు వేసిన ప్రతీ రూపాయిని భద్రపరచి.. దేవాలయంలో సేవలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విరాళంగా ఇస్తున్నట్టు తెలిపారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ