30 నుంచి విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు

Published on Tue, 01/28/2020 - 12:52

సాక్షి, విశాఖపట్నం: విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు ఈ నెల 30 నుంచి అయిదురోజుల పాటు నిర్వహించనున్నామని ఆ పీఠ ఉత్తరాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. హైందవ ధర్మ పరిరక్షణలో విశాఖ శారదా పీఠం రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృత ప్రచారం చేస్తోందన్నారు. ఇక గురువారం ఉదయం శారదా పీఠం వేడుకలు ప్రారంభం కాగా ఫిబ్రవరి 3వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. అయిదు రోజుల పాటు ఘనంగా జరగనున్న ఈ వేడుకల్లో రాజశ్యామల అమ్మవారి విశేష యాగం, టీటీడీ చతుర్వేద సంహిత యాగం, తదితర హోమాలు చేయనున్నట్లు తెలిపారు.

ఫిబ్రవరి 1న విఠల్‌ దాస్‌ మహరాజ్‌ భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. శాస్త్ర సభల్లో అధ్యయనంతోపాటు, వాటిని పరిరక్షిస్తున్న పండితులను స్వర్ణ కంకణ ధారణతో ఘనంగా సత్కరిస్తామని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో జాతీయ శాస్త్ర సభలు, అగ్నిహోత్ర సభలు ప్రత్యేకంగా నిలుస్తాయని.. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి తెలిపారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ