అమ్మవారి సాక్షిగా హత్య

Published on Mon, 03/23/2015 - 19:22

ప్రొద్దుటూరు : పవిత్ర దేవాలయంలో సాక్షాత్తూ అమ్మవారి సాక్షిగా ఒక మహిళను దారుణంగా రాయితో బాది హత్య చేసిన ఘటన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ప్రొద్దుటూరుకు చెందిన ఈశ్వరమ్మ అనే మహిళ పెన్నానది ఒడ్డున ఉన్న చౌడేశ్వరీదేవి ఆలయానికి పూజల నిమిత్తం వస్తూ ఉండేది. ఈ నేపథ్యంలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను అమ్మవారి పాదాల చెంత బండరాయితో బాది హత్య చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాగా ఈ హత్య వెనుక ఆలయ వాచ్‌మెన్ నర్సింహులు హస్తముందేమోనన్న అనుమానంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ