గేదెను ఢీకొని యువకుడి మృతి

Published on Sun, 08/30/2015 - 10:15

పులివెందుల (వైఎస్సార్ జిల్లా) : ఓ యువకుడు బైక్‌పై వేగంగా వెళ్తూ రోడ్డుపై అడ్డు వచ్చిన గేదెను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం వైఎస్సార్ జిల్లా పులివెందుల పట్టణం కేంద్రంలో వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. వేముల మండలానికి చెందిన గౌస్ ఫీరా(23) పులివెందుల నుంచి బైక్‌పై శనివారం అర్ధరాత్రి వేముల వెళ్తున్నాడు.

కాగా పట్టణంలోని విజయ హోమ్స్ రింగ్‌ రోడ్డు వద్ద గౌస్ బైక్‌తో గేదేను ఢీ కొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ గౌస్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అయితే బైక్ వేగంగా వచ్చి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన గేదె కూడా అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ