amp pages | Sakshi

హామీలనే మాఫీ చేస్తున్న చంద్రబాబు

Published on Tue, 09/30/2014 - 03:19

* ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ రైతు విభాగం
* రైతులకిచ్చిన హామీలు అమలు చేయకపోతే పోరాటమే

సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వస్తే రైతుల పంట రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు తానిచ్చిన హామీలనే మాఫీ చేసే యత్నంలో పడిపోయారని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం దుయ్యబట్టింది. బాబు ఎన్నికల సమయంలో రైతులకిచ్చిన హామీలను అమలు చేయకపోతే రైతుల తరపున పోరాటం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ వ్యవసాయరంగం సంక్షోభంలో ఉందని, రైతుల సమస్యలపై క్రియాశీలంగా ఉంటూ ఎప్పటికపుడు వాటి పరిష్కారానికి ఉద్యమించాలని తీర్మానించింది. రైతు విభాగం అధ్యక్షుడు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి అధ్యక్షతన సోమవారం మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ పరిస్థితులపై లోతుగా చర్చించారు. పార్టీ పర్యవేక్షణ కమిటీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి హాజరైన ఈ సమావేశంలోనే తొలి అధ్యక్షునిగా నాగిరెడ్డి పదవీ స్వీకారం చేశారు. షరతుల్లేకుండా రైతుల పంట రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని, వ్యవసాయ పంటలకు మద్దతు ధర కల్పిస్తామని, రూ.ఐదు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని చంద్రబాబు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అమలు చేయడం లేదని సమావేశం దుయ్యబట్టింది. జిల్లాల వారీ గా పరిస్థితిని సమీక్షిస్తూ మొత్తం మీద ఒక్క ప్రత్తి మినహా అన్ని పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోవడంపట్ల ఆందోళన వ్యక్తం చేసింది.  కనీస మద్దతు ధరను నామమాత్రంగా ప్రకటిస్తున్నా కేంద్రం వైఖరిని రాష్ట్రం ప్రశ్నించకపోవడాన్ని సమావేశం గర్హించింది.
 
 బలవంతంగా భూసేకరణ చేస్తే ఊరుకోం..
 రాజధాని నిర్మాణం పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాల రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తే వైఎస్సార్‌సీపీ రైతు విభాగం ప్రతిఘటిస్తుందని సమావేశం హెచ్చరించింది. స్వచ్ఛం దంగా ముందుకు వచ్చే రైతుల నుంచే ల్యాండ్ పూలింగ్ విధానంలో భూమిని తీసుకుంటామని తొలుత చెప్పిన టీడీపీ ప్రభుత్వం ఇపుడు బల వంతంగానైనా సరే తీసుకుంటామని మాట్లాడుతున్నారని, ఇదెంత మాత్రం శ్రేయస్కరం కాదని రైతు ప్రతినిధులు హెచ్చరించారు. సమావేశానంతరం అధ్యక్షుడు నాగిరెడ్డి, విజయసాయిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ... ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా రైతుల తరపున ఎలా పోరాడాలో అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకున్నామని చెప్పారు. షరతుల్లేకుండా పంట రుణాల మాఫీ, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయకుండా చంద్రబాబు రైతులను మోసం చేశారని విమర్శించారు. సమావేశంలో జిల్లాల రైతు నేతలు కొల్లి రాజశేఖర్, శ్రీధర్, రాజబావు, మధుసూదనరెడ్డి, ప్రసాదరెడ్డి , ఆదికేశవరెడ్డి , సుబ్రమణేశ్వరరెడ్డి,సుబ్బారెడి, శివరామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)